చెన్నై: గత వారం రోజులుగా అనారోగ్యకారణాలతో చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలిత తొలిసారి స్పందించారు. తాను బాగున్నానని, కోలుకుంటున్నానని ఆమె తెలిపారు. తనకు జరుగుతున్న ట్రీట్మెంట్ పట్ల ఆమె సంతృప్తిని వ్యక్తం చేశారని చెన్నై అపోలో ఆస్పత్రి వర్గాలు తాజా బులెటన్ను విడుదల చేశాయి. జయలలితకు మరిన్ని రోజులు చికిత్స అవసరమని సూచించినట్టు వైద్యులు వెల్లడించారు.
గత కొంత కాలంగా జయ ఆరోగ్యంపై వదంతులు రావడంతో పార్టీ వర్గాలు, అభిమానులు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. మరోపక్క కావేరీ నదీ వ్యవహారాల విషయంలో కర్ణాటక,తమిళనాడుల మధ్య తీవ్ర ఘర్షణ జరుగుతున్న జరుగుతోంది. వారం క్రితం జయలలిత తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్ తో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.