ఫ్లైట్లో పొగ.. ఉలిక్కి పడిన 65 మంది

15 Jun, 2016 12:31 IST|Sakshi

బెంగళూరు: క్యాబిన్లో పొగరావడంతో బెంగళూరులో జెట్ విమానాన్ని అత్యవసరం దించివేశారు. పైలెట్ అప్రమత్తంగా వ్యవహరించి ఈ పనిచేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. జెట్ ఎయిర్ వేస్ కు చెందిన 9డబ్ల్యూ 2839 విమానం 65 మంది ప్రయాణీకులతో బెంగళూరు నుంచి మంగళూరుకు ఉదయం 10గంటల ప్రాంతంలో బయలుదేరింది.

అయితే, టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఇంజిన్లో సమస్య అనిపించడంతోపాటు క్యాబిన్లో పొగలాంటిది రావడంతో అప్రమత్తమైన పైలెట్ విమానాన్ని తిరిగి బెంగళూరు విమానాశ్రయంలోని 10.20గంటల ప్రాంతంలో దించివేశాడు. దీంతో ప్రయాణీకులు విమాన సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. సమస్యపై పరిశీలన చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు