డైరెక్ట్‌ ఫ్లయిట్‌: బెంగళూరు టు ఆమ్‌స్టర్‌డ్యామ్‌

5 Oct, 2017 15:16 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : ఆమ్‌స్టర్‌డ్యామ్‌ వెళ్లే విమాన ప్రయాణీకులకు శుభవార్త. ఈ సుదూర ప్రయాణంలో కనెక్టింగ్‌ ఫ్లయిట్‌ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు డైరెక్ట్‌ ఫ్లయిట్స్‌ అందుబాటులోకి రానున్నాయి. బెంగుళూరు నుంచి నెదర్లాండ్‌ రాజధాని ఆమ్‌స్టర్‌డ్యామ్‌ కు ప్రతిరోజూ నాన్‌స్టాప్‌ ఫ్లయిట్‌ ప్రారంభం కానుంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ ఈ మేరకు విమాన సర్వీసులను నడపనున్నట్టు ప్రకటించింది.

ఈనెల 29 నుంచి ఈ సర్వీసులు అందుబాటులో రానున్నాయి. బెంగళూరులో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ వినయ్‌ దూబే ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ప్రయాణ సమయం దాదాపు తొమ్మిది గంటలు పడుతుంది. ప్రతి రోజూ బెంగళూరు నుంచి రాత్రి 02:25 (ఎల్‌.టీ) గంటలకు విమానం (జెట్‌ ఎయిర్‌ వేస్‌ 9 డబ్ల్యూ 236) ఆమ్‌స్టర్‌డ్యామ్‌ కు బయలు దేరుతుంది. అదే విధంగా ఆమ్‌స్టర్‌డ్యామ్‌ నుంచి బెంగళూరుకు ఉదయం 10:50 గంటలకు (ఎల్‌.టీ)కు విమానం (జెట్‌ ఎయిర్‌వేస్‌ 9డబ్ల్యూ 235) బయలు దేరుతుంది. ప్రారంభ ఆఫర్‌గా ఎకానమీ క్లాస్‌ టికెట్‌  ధర రూ.39,999గాను, బిజినెస్‌ క్లాస్‌ టికెట్‌ ధర రూ.1,21,000గా నిర్ణయించారు.


 

మరిన్ని వార్తలు