జార్ఖండ్లో రైలు బోగీలో మంటలు

4 Jun, 2016 10:08 IST|Sakshi
జార్ఖండ్లో రైలు బోగీలో మంటలు

జార్ఖండ్ : జార్ఖండ్లోని హజారీబాగ్ రైల్వేస్టేషన్ సమీపంలోని రైలు బోగీలో మంటలు అంటుకున్నాయి. సిబ్బందికి భోజనం తయారు చేస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిప్రమాదానికి గురైన బోగీని రైలు నుంచి తప్పించారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది...బోగీలో వ్యాపించిన మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు