ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్లోని ఉన్నావో జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ జర్నలిస్టు, కెమెరామెన్లు మృతి చెందారు. ఈ సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితేనేషనల్ వాయిస్ న్యూస్ చానల్కి రణవిజయ్ కెమెరామెన్గా, ఆషు తివారీ పాత్రికేయుడిగా పనిచేస్తున్నారు. నిన్న రాత్రి వీరద్దరూ కలిసి బైక్పై వెళ్తుండగా ఓ కారు వచ్చి ఢీకొట్టింది. దీంతో రణవిజయ్ అక్కడికక్కడే మృతి చెందారు. తివారీని ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యమంలోనే మరణించినట్లు వైద్యులు తెలిపారు.