జర్నలిస్టు కాల్చివేత

26 Oct, 2015 14:19 IST|Sakshi

పట్నా:  నేతల మధ్య మాటల తూటాలతో  బిహార్ లో ఒకవైపు ఎన్నికల వేడి రగులుతోంటే  మరోవైపు ఓ జర్నలిస్టు హత్య ప్రకంపనలు రేపింది. స్థానిక దినపత్రికకు చెందిన  మితిలేష్ పాండే(40) ను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. కస్తా గ్రామంలోని ఆయన సొంత ఇంట్లోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.


ముసుగులు ధరించిన వచ్చిన ముగ్గురు వ్యక్తులు నిద్రపోతున్న మితిలేష్ పై కాల్పులు జరిపారని బంధువు ఉమేష్ కుమార్ పాండే తెలిపారు. ఆ సమయంలో తాను బయట ఉన్నానని, తుపాకీ శబ్దం విని తిరిగి వచ్చేసరికి మితిలేష్ రక్తపుమడుగులో కొట్టుకుంటున్నాడని చెప్పారు.  ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు ఘోరం జరిగిపోయిందని  వాపోయాడు. అతనికి ఇదిరవకే చంపేస్తామని బెదిరింపులు వచ్చాయని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించాడు.  దర్యాప్తు చేస్తున్నామని  సీనియర్ పోలీసు అధికారి  తెలిపారు.

మరిన్ని వార్తలు