రోస్టర్‌ విధానంపై నేడు తీర్పు

6 Jul, 2018 04:07 IST|Sakshi

న్యూఢిల్లీ: కేసుల కేటాయింపులో ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) అవలంబిస్తున్న రోస్టర్‌ విధానాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు తీర్పు చెప్పనుంది. మాజీ న్యాయ శాఖ మంత్రి శాంతి భూషణ్‌ ఈ పిటిషన్‌ వేశారు. ఈ వ్యవహారంలో జస్టిస్‌ ఏకే సిక్రి, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ల ధర్మాసనం ఏప్రిల్‌ 27నే తీర్పును రిజర్వు చేసింది.
 

మరిన్ని వార్తలు