బోఫోర్స్‌ బెంచ్‌ నుంచి తప్పుకున్నారు

14 Feb, 2018 02:47 IST|Sakshi

న్యూఢిల్లీ: బోఫోర్స్‌ కేసును విచారిస్తోన్న సుప్రీం కోర్టు బెంచ్‌ నుంచి జడ్జి జస్టిస్‌ ఖన్వీల్కర్‌ తప్పుకున్నారు. సీజేఐ జస్టిస్‌ మిశ్రా, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనంలో భాగంగా ఉన్న ఆయన తన నిర్ణయానికి సంబంధించి ఎలాంటి కారణాల్ని పేర్కొనలేదు.

రూ. 64 కోట్ల బోఫోర్స్‌ కుంభకోణం కేసులో అన్ని ఆరోపణల్ని కొట్టివేస్తూ 2005లో ఢిల్లీ హైకోర్టు తీర్పునివ్వగా దానిని సవాలు చేస్తూ బీజేపీ నేత అగర్వాల్‌  కోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న సీబీఐ ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ కేసులో పిటిషన్‌ దాఖలు చేసేందుకున్న అర్హతేంటో చెప్పాలని అగర్వాల్‌ను కోర్టు ఆదేశించింది. ఆ అంశంపై ధర్మాసనం మంగళవారం విచారించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు