సాక్షి, ముంబై: విధాన సభ ప్రొటెం స్పీకర్గా బీజేపీ ఎమ్మెల్యే కాళిదాస్ కోళంబ్కర్ నియమితులయ్యారు. రాజ్భవన్లో మంగళవారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ పదవి రేసులో బాలాసాహెబ్ థోరాత్, బబన్రావ్ పాచ్పుతే తదితరులున్నప్పటికీ సభలో సీనియర్ అయిన కాళిదాస్ను గవర్నర్ ఎంపిక చేశారు.
నేడే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం
మహారాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఎమ్మెల్యేలంతా హాజరు కావాలని గవర్నర్ కోష్యారీ సూచించారు. కొత్త ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ కాళిదాస్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.