కరోనా: ఇంకా కోలుకోని కనికా కపూర్‌

25 Mar, 2020 15:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ గాయని కనికా కపూర్‌కు మూడోసారి నిర్వహించిన కరోనా పరీక్షలోనూ పాజిటివ్‌గా తేలింది. లండన్‌ నుంచి వచ్చిన కనికా కపూర్‌ ఉత్తరప్రదేశ్‌లోని హోటల్‌లో బస చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువరు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులను కలిశారు. ఈ నేపథ్యంలో ఆమెకు కరోనా సోకినట్లు వెల్లడి కావడంతో కలకలం రేగింది.

ఇక కొన్నాళ్లపాటు స్వీయ నిర్బంధంలో ఉన్న కనికా కపూర్‌ ప్రస్తుతం సంజయ్‌ గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం, మంగళవారం రాత్రి కనికాకు మరోసారి కరోనా టెస్టు నిర్వహించగా.. మరోసారి పాజిటివ్‌గా తేలినట్లు వైద్యులు వెల్లడించారు. ఆమె ఇంకా కోలుకోలేదని.. ఈ క్రమంలో మరో రెండుసార్లు పరీక్షలు నిర్వహించి నెగటివ్‌గా తేలిన తర్వాతే డిశ్చార్జి చేయనున్నట్లు వెల్లడించారు. ఇక కనికాతో పాటు హోటల్‌ తాజ్‌లో బస చేసిన ఆమె స్నేహితుడు ఓజాస్‌ దేశాయ్‌కు నెగటివ్‌గా తేలినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు