బీజేపీ ఎంపీపై కపిల్ సిబాల్ ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే కాళ్లను కడిగి ఆ నీటిని పవన్ అనే కార్యకర్త తాగిన విషయం తెలిసిందే. అ వీడియోను దుబే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఎంపీ తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి కపిల్ సిబాల్ ఘాటుగా స్పందించారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లని కడిగి.. ఆ మురికి నీళ్లను నువ్వు తాగు. దాని ద్వారా నువ్వు కూడా మోదీపై ఉన్న ప్రేమను వ్యక్తం చేయ్యవచ్చు’’ అని ట్వీట్లో చేశారు.
జార్ఖండ్లోని గొడ్డా నియోజకర్గంలో ఆదివారం ఓ కార్యక్రమంలో నిశికాంత్ దుబే పాల్గొన్నారు. ఆ సమయంలో అక్కడున్న బీజేపీ కార్యకర్త పవన్ ఓ ప్లేట్లో ఎంపీ కాళ్లు కడిగి ఆ నీటిని తాగాడు. తనపై ఉన్న ప్రేమను పవన్ ఆ విధంగా వ్యక్తపరిచాడని దుబే సమర్ధించుకున్నాడు. ప్రజా ప్రతినిధివై ఉండి కార్యకర్తతో కాళ్లు కడిగించుకుంటావా అంటూ అతనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
Supporter of Nishikant Dubey washes his feet and then drinks the dirty water
Dubey says it is an expression of the supporter’s love for him
Will Dubeyji wash Modiji’s feet and drink the dirty water ?
If not , does it mean he does not love Modi
— Kapil Sibal (@KapilSibal) September 17, 2018