అమరవీరుల త్యాగాలు మరవలేనివి: మోదీ

26 Jul, 2017 10:54 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత సైన్యం సామర్థ్యాన్ని, దేశం కోసం చేసిన వారి త్యాగాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. 1999లో పాకిస్తాన్‌తో జరిగిన కార్గిల్‌ పోరులో భారత్‌ విజయం సాధించగా ఏటా జూలై 26న నిర్వహిస్తున్న కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా ప్రధాని బుధవారం సైనికులకు తన ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. దేశ గౌరవం కోసం, దేశ ప్రజల రక్షణ కోసం కార్గిల్‌ పోరులో  సైనికులు చూపిన అసమాన ధైర్యసాహసాలను ఆయన వరుస ట్వీట్లలో అభినందించారు.

మరిన్ని వార్తలు