పల్లె నిద్రలో సీఎం హామీ

27 Jun, 2019 08:14 IST|Sakshi

రాయచూరు ‌: భవిష్యత్తులో దివ్యాంగులకు రూ.2500, వృద్ధులకు రూ.2 వేల వరకూ పింఛన్‌ పెంచుతామని ముఖ్యమంత్రి కుమారస్వామి పేర్కొన్నారు. ఆయన బుధవారం మాన్వి తాలూకా కరేగుడ్డలో పర్యటించారు. ఈ సందర్భంగా మాన్వి తాలూకా కరేగుడ్డలో ముఖ్యమంత్రి పాఠశాల గదిలో నిద్రించారు. రాత్రివేళ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు వెంకట్రావ్‌ నాడగౌడ, శాసన సభ్యులు రాజా వెంకటప్ప నాయక్, ప్రతాప్‌గౌడ పాటిల్, అమరేగౌడ, హులిగేరిలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు