ఆ టేపులూ సాక్ష్యాలే: సుప్రీం

5 Nov, 2019 05:36 IST|Sakshi
కాంగ్రెస్‌–జేడీఎస్‌ రెబెల్‌ ఎమ్మెల్యేలు

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో 17 మంది కాంగ్రెస్‌–జేడీఎస్‌ రెబెల్‌ ఎమ్మెల్యేల అనర్హత కేసు మలుపు తిరిగింది. తమపై అనర్హత విధించడం సబబు కాదని ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టులో విచారణలో ఉండటం తెల్సిందే. ఈ నేపథ్యంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలను తామే ముంబైకి పంపించామని సీఎం యడియూరప్ప చెబుతున్న ఆడియో, వీడియోలు ఇటీవల బయటకు వచ్చాయి. ఆ టేపులనూ సాక్ష్యాలుగా తీసుకుంటామని సుప్రీంకోర్టు సోమవారం ప్రకటించింది. దీనికి ముందు ఈ టేపులను తీర్పు సందర్భంగా పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ వాదించింది. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్‌–జేడీఎస్‌ల ప్రభుత్వాన్ని కూల్చారని సుప్రీంకు  కాంగ్రెస్‌ కర్ణాటక విభాగం నివేదించింది.  

మరిన్ని వార్తలు