-

అమిత్‌ షాతో కేసీఆర్‌ 40 నిమిషాల భేటీ

4 Oct, 2019 14:54 IST|Sakshi

న్యూఢిల్లీ: నీళ్లు, నిధుల అంశాలే ప్రధాన ఎజెండాగా ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు కేసీఆర్‌ మీడియాతో వివరించారు. ఆంధ్రప్రదేశ్‌తో కలసి సంయుక్తంగా నిర్మించతలపెట్టిన కృష్ణా – గోదావరి నదుల అనుసంధానం ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలపై కూడా చర్చించినట్లు తెలిపారు. అదేవిధంగా కాళేశ్వరం, పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ ప్రాజెక్టు హోదా తమకు ఎప్పటికీ ప్రాధాన్య అంశమేనని కేసీఆర్ తేల్చిచెప్పారు. ఈ భేటీ అమిత్‌ షా, కేసీఆర్‌ల మధ్య దాదాపు 40 నిమిషాలపాటు కొనసాగింది. 

మరిన్ని వార్తలు