ప్రకృతిని కాపాడుకుందాం: ఆప్

5 Jun, 2015 14:07 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా  ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడుతామంటూ ప్రతిజ్ఞ చేసింది.  ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు ప్రమాణం చేసింది. మన రోజువారీ  జీవితంలో భాగంగా   ప్రకృతిని కాపాడుతామని ప్రతిన  బూనాల్సిన అవసరం ఉందని కేజ్రీవాల్  పేర్కొన్నారు.

 

ఈ  సందర్భంగా సీఎం కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఢిల్లీ సెక్రటేరియట్ ఆవరణలో మొక్కలు నాటారు. ఇతర మంత్రులు,   చీఫ్ సెక్రటరీ కెకె శర్మ, సీనియర్ ప్రభుత్వ అధికారులు, వివిధ శాఖలు ముఖ్యఅధికారులు కూడా మొక్కలు నాటిన వారిలో ఉన్నారు.

>
మరిన్ని వార్తలు