మోదీతో కేజ్రీవాల్ సమావేశం

12 Feb, 2015 10:46 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ గురువారం భేటీ అయ్యారు. ఆయన ఈ సందర్భంగా తన ప్రమాణ స్వీకారానికి మోదీని ఆహ్వానించారు.  కాగా కేజ్రీవాల్ బుధవారం కేంద్రమంత్రులతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన విషయం తెలిసిందే.

కాగా సరిగ్గా ఏడాది క్రితం రాజీనామా చేసిన రోజునే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రెండోసారి ఫిబ్రవరి 14న  ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కనీవిని ఎరుగని రీతిలో జాతీయ పార్టీలను మట్టికరిపించిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు భారీస్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు