దుబాయ్‌కి విమాన సర్వీసులు పునరుద్ధరించండి

23 Jun, 2020 15:52 IST|Sakshi

తిరువనంతపురం: దుబాయ్‌కు విమానాలను పునరుద్ధరించాలని కేరళ సీఎం పినరయి విజయన్‌ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కరోనా వల్ల స్వదేశాలకు పంపించిన వారిని తిరిగి ఈ నెల 22 నుంచి దుబాయ్‌ అనుమతిస్తున్నదని ఆయన లేఖలో తెలిపారు. ఈ నేపథ్యంలో దుబాయ్‌తో పాటు గల్ఫ్‌ దేశాలకు తిరిగి వెళ్లి పనిలో చేరేందుకు చాలా మంది కేరళ వాసులు ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ అంశాన్ని పరిశీలించి దుబాయ్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించాలని ప్రధాని మోదీని కోరారు. ఈ మేరకు పౌర విమాన మంత్రిత్వ శాఖకు ఆదేశాలని జారీ చేయాలని విజయన్‌ సూచించారు. మరోవైపు విదేశాల్లో చిక్కుకున్న కేరళీయులను రాష్ట్రానికి తిరిగి తీసుకురావాలంటూ విపక్ష నేత రమేశ్‌తో పాటు ఇతర నేతలు ఇటీవలే ప్రధాని మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే

>
మరిన్ని వార్తలు