కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఏసీ జోస్‌ కన్నుమూత

23 Jan, 2016 08:02 IST|Sakshi

కేరళ: కేరళ సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ పార్లమెంటరీ సభ్యుడు, మాజీ కేరళ అసెంబ్లీ స్పీకర్‌ ఏసీ జోస్‌ (79) శనివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. కేరళ రాష్ట్రంలోని ఈదాపల్లిలో జన్మించిన ఆయన కోచిలోని సెంట్‌ అల్బర్ట్స్‌ కాలేజీలో విద్యాభ్యాసం చేశారు.

ప్రభుత్వ లా కాలేజీలో బీఎస్సీ, ఎల్‌ఎల్‌ఎమ్‌ డిగ్రీ పట్టాలు పొందారు. 1982 లో కేరళ అసెంబ్లీ స్వీకర్‌గా సేవలు అందించారు. సాధారణ ఎన్నికల్లో 1996, 1998, 1999 లో కాంగ్రెస్‌ ఎంపీగా లోక్‌సభకు ఎన్నికయ్యారు.

మరిన్ని వార్తలు