కువైట్‌లో కత్తిపోటుకు గురైన భారత నర్సు

22 Feb, 2017 17:00 IST|Sakshi
కువైట్‌: కువైట్‌లో భారత నర్సు కత్తిపోటుకు గురైంది. ఆమెను నగరంలోని ఫార్వానియా ఆసుపత్రికి తరలించారు. కేరళ రా‍ష్ట్రం కొట్టాయంకు చెందిన గోపికా షాజీకుమార్‌ అక్కడే అల్‌ జహ్రా ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. ఆమెపై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ ట్వీట్టర్‌ ద్వారా తెలిపారు. ఈ ఘటన సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని కువైట్‌లోని భారత ఎంబసీని ఆదేశించినని, కువైట్‌లో భారతీయుల రక్షణ కోసం భారత ఎంబసీ కృషి చేస్తుందని సుష్మా ట్వీట్‌ చేశారు. గత వారం ఓమన్‌లో డెంటల్‌ క్లినిక్‌లో పనిచేస్తున్న కేరళకు చెందిన షెబిన్‌ జీవా (31) హత్యకు గురైంది.
 
మరిన్ని వార్తలు