పీఏసీ చైర్మన్‌గా మరోసారి ఖర్గే

2 May, 2018 02:06 IST|Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) అధ్యక్షునిగా లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే మళ్లీ నియమితులయ్యారు. ఖర్గేని మరోసారి పీఏసీ చైర్మన్‌గా నియమిస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

మొత్తం 22 మంది సభ్యుల ఈ కమిటీలో అధికార పక్ష సభ్యులే మెజారిటీ సంఖ్యలో ఉంటారు. ప్రభుత్వ ఖర్చులు పార్లమెంట్‌ కేటాయింపులకు అనుగుణంగా ఉన్నాయో లేదో ఈ కమిటీ పరిశీలిస్తుంది. అంచనాల కమిటీకి బీజేపీ నేత మురళీ మనోహర్‌ జోషీని, శాంతకుమార్‌ను పబ్లిక్‌ అండర్‌టేకింగ్స్‌ కమిటీకి చైర్మన్‌గా నియమిస్తున్నట్లు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తెలిపారు. ఇవి ఏడాదిపాటు పనిచేస్తాయి.

మరిన్ని వార్తలు