లాలూ కుమార్తె ఇంటిపై ఈడీ దాడులు

8 Jul, 2017 10:31 IST|Sakshi
లాలూ కుమార్తె ఇంటిపై ఈడీ దాడులు

న్యూఢిల్లీ: అక్రమాస్తులు, అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌ కుటుంబ సభ్యులపై ఈడీ దాడుల పరంపర కొనసాగుతోంది. నిన్నటికి నిన్న సీబీఐ అధికారులు లాలూ ఇంటిపై ఆయనకు సంబంధించిన 12 స్థావరాలపై ఏకకాలంలో దాడులు చేయగా తాజాగా లాలూ కుమార్తె, ఎంపీ మిసా భారతీ ఢిల్లీ నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు దాడులు నిర్వహించారు. అతి తక్కువ ధరలకే భూములు కొల్లగొట్టారని, పెద్ద మొత్తంలో ఆస్తులు కూడ బెట్టారనే ఆరోపణల కిందట ప్రస్తుతం దాడులు నిర్వహించిన అధికారులు మిసాభారతీ ఆమె భర్త శైలేష్‌ కుమార్‌ను ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.

గత నెలలో కూడా వారి కంపెనీలను ఈడీ అధికారులు విచారించినట్లు సమాచారం. కంపెనీల పేరిట పెద్ద మొత్తంలో బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నారని, వీటికి సరైన పత్రాలు కూఆడ సమర్పించలేదనే విషయాన్ని కూడా వారిని అడిగినట్లు ఇప్పటికే తెలిసింది. లాలూ కుటుంబ సభ్యులంతా కూడా వేరే వారి పేరిట పెద్ద మొత్తంలో ఆస్తులు కొనుగోలు చేశారని, వాస్తవానికి ఆ ఆస్తులు లాలూ కుటుంబానికి సంబంధించినవేనని దర్యాప్తు అధికారులు ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.

>
మరిన్ని వార్తలు