లతా మంగేష్కర్ మెచ్చుకున్నారు

24 Jan, 2015 17:45 IST|Sakshi
లతా మంగేష్కర్ మెచ్చుకున్నారు

ముంబై: ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా ప్రారంభించిన 'బేటీ బచావో - బేటీ పడావో' ప్రచార కార్యక్రమాన్ని ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమం వల్ల దేశంలో ఆడపిల్లలకు రక్షణ దొరుకుతుందని, శిశుహత్యలకు చెక్ పెట్టవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

'మోదీజీ నమస్కారం. సరస్వతీ దేవి పండుగను వసంత పంచమిగా చేయటం ఆనందకరం. ఇది మహిళా శక్తికి నిదర్శనం. మీరు ప్రారంభించిన 'బేటీ బచావో - బేటీ పడావో'  మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను'  అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లతా మంగేష్కర్ ట్వీట్ చేశారు.

ఈ నెల 22 న బేటీ బచావో - బేటీ పడావో ప్రచార కార్యక్రమాన్ని నరేంద్రమోదీ హర్యానాలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. శిశుహత్యలపై ప్రజలకు అవగాహన కల్పించటం, దేశంలో లింగ నిష్పత్తిని పెంచటం దీని ప్రధాన లక్ష్యం.

మరిన్ని వార్తలు