చితక్కొట్టుకున్న కార్యకర్తలు.. వీడియో వైరల్‌

22 Apr, 2019 11:52 IST|Sakshi

తిరువనంతపురం : కేరళలోని కొల్లాంలోని పూయపల్లిలో రెండు రాజకీయ గ్రూపుల మధ్య జరిగిన కొట్లాటకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఏప్రిల్‌ 23వ తేదీన కేరళలో పోలింగ్‌ జరుగనున్న 20 లోక్‌సభ స్థానాల్లో సీపీఎం నాయకత్వంలోని లెఫ్ట్‌ అండ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్(ఎల్‌డీఎఫ్‌), కాంగ్రెస్‌ నాయకత్వంలోని యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌(యూడీఎఫ్‌) మధ్యనే తీవ్ర పోటీ నెలకొని ఉంది.

అయితే లోక్‌ సభ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు అయిన ఆదివారం  పూయపల్లిలో ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్ కార్యకర్తలు ఎదురుపడ్డారు. దీంతో చేతుల్లో ఉన్న పార్టీ జెండాలతోనే ఒకరినొకరు చితక్కొట్టుకున్నారు.

మరిన్ని వార్తలు