మోదీ, అమిత్‌ షాలను అభినందించిన అద్వాణీ

5 Aug, 2019 16:37 IST|Sakshi

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేయడంపై బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వాణీ హర్షం వ్యక్తం చేశారు. ఆర్టికల్‌ 370ని రద్దు చేయడాన్ని సాహసోపేత నిర్ణయంగా వర్ణించారు. ఈ సందర్భంగా అద్వాణీ మాట్లాడుతూ.. ‘జాతీయ సమగ్రత బలోపేతం దిశగా ఇదో గొప్ప ముందడుగు. ఆర్టికల్‌ 370 రద్దు బీజేపీ ప్రధాన భావజాలాల్లో ఒకటి. జనసంఘ్‌ రోజుల నుంచే ఈ ప్రతిపాదన ఉంద’ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు ఆయన అద్వాణీ అభినందనలు తెలిపారు. జమ్ముకశ్మీర్‌, లడఖ్‌లో శాంతి, సుఖ సంతోషాల స్థాపనలో ఈ నిర్ణయం కీలకంగా మారనుందని అద్వాణీ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు