లోక్ సభలో తొలగిపోయిన ప్రతిష్టంభన

12 Aug, 2015 13:12 IST|Sakshi
లోక్ సభలో తొలగిపోయిన ప్రతిష్టంభన

న్యూఢిల్లీ : లోక్ సభలో ప్రతిష్టంభన తొలగిపోయింది. అధికార, ప్రతిపక్షాల మధ్య సామరస్య ధోరణి నెలకొంది. లలిత్ మోదీ అంశంపై చర్చించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని  స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. రెండున్నర గంటలపాటు సభలో ఈ అంశంపై చర్చ జరగనుంది. కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ నేత మల్లిఖార్జున ఖర్గే చర్చ ప్రారంభించారు. అంతకు ముందు ఇదే అంశంపై చర్చించాలంటూ కాంగ్రెస్ పట్టుబట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సభ కొద్దిసేపు వాయిదా పడింది.

మరిన్ని వార్తలు