కోవిడ్‌తో ‘లోక్‌పాల్‌’ త్రిపాఠీ కన్నుమూత

3 May, 2020 05:34 IST|Sakshi
రిటైర్డు జస్టిస్‌ ఏకే త్రిపాఠీ

న్యూఢిల్లీ: లోక్‌పాల్‌ సభ్యుడు జస్టిస్‌(రిటైర్డు) ఏకే త్రిపాఠీ(62) కరోనా వైరస్‌ సోకి చనిపోయారు. కోవిడ్‌తో చికిత్స పొందుతూ ఎయిమ్స్‌లో శనివారం రాత్రి కన్నుమూశారని అధికారులు తెలిపారు. ఆయన కుమార్తె, పని మనిషికి కూడా ఈ వైరస్‌ సోకిందని, వారు కోలుకున్నారని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన త్రిపాఠీ, ప్రస్తుత లోక్‌పాల్‌లోని నలుగురు సభ్యుల్లో ఒకరు. 

మరిన్ని వార్తలు