రాముడు కూడా అత్యాచారాలను ఆపలేడు : బీజేజీ ఎమ్మెల్యే

8 Jul, 2018 08:46 IST|Sakshi
సురేందర్‌ సింగ్‌ (ఫైల్‌ ఫోటో)

యూపీ బీజేపీ ఎమ్మెల్యే సురేందర్‌ సింగ్‌ వ్యాఖ్యలు

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే సురేందర్‌ సింగ్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలపై జరిగే అత్యాచారాలను శ్రీ రాముడు కూడా ఆపలేడని, అది చాలా సహజం’ అని పేర్కొన్నారు. రోహానియా నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన సురేందర్‌ శనివారం ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ‘మహిళలపై జరిగే అత్యాచారాలను రాముడు కూడా నివారించలేడు. ప్రతి ఒక్కరు మహిళలను తమ కుటుంబ సభ్యులుగా, అక్కచెల్లెలుగా భావించాలి. అందరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే అఘాయిత్యాలను నివారించగలం’ అంటూ వ్యాఖ్యానించారు. సురేందర్‌ సింగ్‌ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పలుమార్లు వార్తల్లో నిలిచారు.

ప్రభుత్వ అధికారుల కంటే ప్రాస్టిట్యూట్లు (వేశ్యలు) నయమని గతంలో ఓ కార్యాక్రమంలో వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అధికారులు డబ్బులు తీసుకుంటున్నారు కానీ, పనిచేయడం లేదని, వేశ్యలు డబ్బులు తీసుకున్నా డ్యాన్స్‌లు చేసి మనకు సంతోషం కలిగిస్తారన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు మొబైల్‌ ఫోన్స్‌ ఇవ్వడం వల్లనే యువత అత్యాచారాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్‌ కేసులో నిందితుడిగా ఉన్న మరో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌కు సురేందర్‌ సింగ్‌ మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు