రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ఎల్పీయూ విద్యార్థిని

12 Jan, 2018 04:16 IST|Sakshi

జలంధర్‌: ఈ ఏడాది జనవరి 26న ఢిల్లీలో నిర్వహించే రిపబ్లిక్‌ డే పరేడ్‌కు లవ్‌లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ(ఎల్పీయూ)కి చెందిన అంబికా మిశ్రా ఎంపికయ్యారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అంబిక ప్రస్తుతం ఎల్పీయూలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్‌గా ఏడాదిలో 145 గంటలు పనిచేయడంతో పాటు కథక్‌ నృత్యం, పాటలు, ఉపన్యాసం తదితర విభాగాల్లో చూపిన ప్రతిభ ఆధారంగా అంబిక పరేడ్‌కు ఎంపికైనట్లు ఎల్పీయూ చాన్స్‌లర్‌ అశోక్‌ మిట్టల్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు