‘హాజరు తీసుకునేప్పుడు జైహింద్‌ అనండి’

13 Sep, 2017 11:40 IST|Sakshi
‘హాజరు తీసుకునేప్పుడు జైహింద్‌ అనండి’
సాక్షి, భోపాల్‌: స్కూల్లో టీచర్లు హాజరు తీసుకునేప్పుడు ఎస్‌ సర్‌/ మేడమ్‌ అనే బదులు జైహింద్‌ అనాలని సాత్నా జిల్లా ప్రైయివేట్‌ స్కూల్‌ విద్యార్థులకు మధ్యప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి విజయ్‌ షా సూచించారు. దీంతో విద్యార్థుల్లో దేశభక్తి పెరుగుతుందన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ అనుమతితో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాల్లో అమలు చేస్తామన్నారు. ఇది ప్రయివేట్‌ స్కూల్‌ విద్యార్థులకు ఒక సలహా మాత్రమేనని షా పేర్కొన్నారు. చిత్రకూట్‌లో జరిగిన ప్రిన్సిపాల్స్‌, టీచర్ల డివిజనల్‌ స్థాయి సమావేశంలో మంత్రి ఈ ప్రకటన చేశారు. 
>
మరిన్ని వార్తలు