ఢిల్లీలో భూప్రకంపనలు

2 Jun, 2017 08:33 IST|Sakshi
ఢిల్లీలో భూప్రకంపనలు

న్యూఢిల్లీ: భూ ప్రకంపనలతో దేశ రాజధాని ఉలిక్కిపడింది. శుక్రవారం తెల్లవారుజామున 4: 25 గంటలకు సుమారు ఒక నిమిషం పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల బయటకు పరుగులు తీశారు.

రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 5 పాయింట్లుగా నమోదైంది. భూకంప కేంద్రం హరియాణాలోని రోహ్‌తక్‌ సమీపంలో భూమిలోపల 22 కిలోమీటర్ల లోతులో ఉందని భూకంప అధ్యయన సంస్థ వెల్లడించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు