మహారాష్ట్ర, హరియాణాలో బీజేపీ ముందంజ

24 Oct, 2019 08:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు అనుగుణంగానే ఫలితాలు వస్తున్నాయి. గురువారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే ఇరు రాష్ట్రాల్లో బీజేపీ అభ్యర్ధులు పలు స్ధానాల్లో ముందంజలో ఉన్నారు. మహారాష్ట్రలో మొత్తం 288 స్ధానాలకు గాను ఇప్పటివరకూ అందిన ట్రెండ్స్‌ ప్రకారం బీజేపీ కూటమి 130 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా 46 స్ధానాల్లో యూపీఏ ముందంజలో ఉంది. ఇక హరియాణాలోనూ బీజేపీ 41 స్ధానాల్లో కాంగ్రెస్‌ 29 స్ధానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నానికి పూర్తి ఫలితాలు వెల్లడికానున్నాయి. మరోవైపు విజయంపై ధీమాతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలాయి.

మరిన్ని వార్తలు