ఆ వదంతులను తోసిపుచ్చిన హోంమంత్రి

27 May, 2020 16:20 IST|Sakshi

దుష్ర్పచారానికి పాల్పడితే కఠిన చర్యలు

ముంబై : కరోనా వైరస్‌ కేసులతో వణికిపోతున్న ముంబై , పుణే నగరాల్లో సైన్యాన్ని రంగంలోకి దించినట్టు వాట్సాప్‌ ఇతర సోషల్‌ మీడియా వేదికల్లో సాగుతున్న ప్రచారాన్ని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ తోసిపుచ్చారు. ఈ దుష్ర్పచారాన్ని చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముంబై, పుణే నగరాల్లో 10 రోజుల పాటు కర్ఫ్యూను విధించేందుకు ఆర్మీని మోహరించారని వాట్సాప్‌తో పాటు సోషల్‌ మీడియా వేదికలపై వదంతులు వ్యాప్తిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఈ వార్తలు నిరాధారమైనవని, వీటిని ప్రచారం చేసిన వారిపై చర్యలు చేపట్టడం ప్రారంభమైందని మంత్రి ట్వీట్‌ చేశారు. కరోనా మహమ్మారి కట్టడికి ముంబై, పుణే నగరాల్లో ఆర్మీని దించాలని మహారాష్ట్ర ప్రభుత్వం కోరినట్టు సోషల్‌ మీడియాలో వదంతులు వెల్లువెత్తడంతో ఈ మేరకు మంత్రి వివరణ ఇచ్చారు. సైబర్‌ నేరగాళ్లగా కఠిన చర్యలు చేపట్టాలని సైబర్‌ సెల్‌ ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. టి​క్‌టాక్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ సహా ఇతర సోషల్‌ మీడియా వేదికలపై అభ్యంతరకర వీడియోలు, ఫోటోలను పోస్ట్‌ చేసేవారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

చదవండి : ‘స్టేషన్‌కు రప్పించారు..రైలు లేదన్నారు’

>
మరిన్ని వార్తలు