'ప్రాణాలు పోయినా సరే.. ముక్కలు కానివ్వం'

1 May, 2016 17:40 IST|Sakshi
'ప్రాణాలు పోయినా సరే.. ముక్కలు కానివ్వం'

ముంబై: రాష్ట్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ముక్కలు కానిచ్చే ప్రస్తకేలేదని మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శివసేన పార్టీ పేర్కొంది. మహారాష్ట్ర ఎప్పటికీ ఇలాగే ఉంటుందని, మా ప్రాణాలు పోయినా ఒక్కటిగానే ఉండిపోతుందని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. రాష్ట్ర సమగ్రత, సమైక్యత ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవీస్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని, విదర్భ లాంటి ప్రాంతాలను ప్రత్యేక రాష్ట్రంగా చేయవద్దని చర్చిస్తామన్నారు.

విదర్భ, మరాఠ్వాడా, కొంకణ్ ఇలా అన్ని ప్రాంతాల సమైక్యతే మహారాష్ట్ర గొప్పతనమని, ఎల్లప్పుడూ ఒక్కటిగానే కొనసాగేలా చూస్తామని మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంలో శివసేన నేతలు రాష్ట్ర ప్రజలకు ప్రతిజ్ఞ చేశారు. మహారాష్ట్రను కాపాడేందుకు పుట్టినపార్టీ శివసేన అని, రాష్ట్ర గౌరవాన్ని, పరువును కాపాడాలని సీఎం ఫడ్నవీస్ ను విజ్ఞప్తి చేస్తామని ఆ పార్టీ ముఖ్యనేతలు పేర్కొన్నారు. త్యాగాలకు, ప్రతిష్టకు మహారాష్ట్ర మారుపేరుగా నిలిచిపోతుందని ఉద్ధవ్ ఠాక్రే వివరించారు.

మరిన్ని వార్తలు