రాజధానిలో భారీ అగ్నిప్రమాదం

9 Jan, 2020 08:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని పత్పార్‌గంజ్‌ పారిశ్రామిక ప్రాంతంలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలోని ఓ రెండతస్తుల భవనంలో ఉన్న పేపర్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ వ్యక్తి మరణించారు. మంటలను ఆర్పేందుకు ఘటనా స్ధలానికి 32 అగ్నిమాపక యంత్రాలు చేరుకున్నాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. అగ్నిప్రమాద ఘటనపై సమాచారం అందగానే పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటనా స్ధలానికి చేరుకున్నారు.

మరిన్ని వార్తలు