కోడలు కాపురానికి రావట్లేదని మామ సూసైడ్‌

4 Aug, 2017 16:06 IST|Sakshi
కోడలు కాపురానికి రావట్లేదని మామ సూసైడ్‌
ముజఫర్‌నగర్‌: కోడలు కాపురానికి రావడం లేదని పరువుతో మామ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ముజఫర్‌ నగర్‌లోని నివాసముంటున్న రాజేందర్‌ కుమార్‌(50) అనే వ్యక్తి ఈ మధ్యనే తన కుమారుడికి పెళ్లి చేశాడు. అయితే, కొత్తగా కాపురానికి వచ్చిన కోడలు అత్తగారింట్లో ఇమడలేక పుట్టింటికి వెళ్లిపోయింది.

ఆమెను తిరిగి తీసుకురావడానికి పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురైన మామ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  
 
మరిన్ని వార్తలు