యోగి కాన్వాయ్‌ ముందు దూకేశాడు

31 Dec, 2017 09:44 IST|Sakshi

లక్నో : ఉత్తర ప‍్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్‌ కాన్వాయ్‌ ముందు ఓ వ్యక్తి నిన్న హల్‌ చల్‌ చేశాడు. ఒక్కసారి భద్రతా వాహనాలు ముందు దూకటంతో అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతన్ని పక‍్కకు లాక్కెల్లారు. శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. 

లోక్‌ భవన్‌లో ఓ కార్యక్రమానికి ఆదిత్యానాథ్‌ వెళ్తుండగా ఇది జరిగింది. ఆ వ్యక్తిని సోనెభాంద్రాకు చెందిన శ్యామ్‌జీ మిశ్రా(30)గా పోలీసులు అతన్ని గుర్తించారు. ఇల్లీగల్‌ మైనింగ్‌ ఆరోపణలు ఎదుర్కుంటున్న ఇద్దరు బీజేపీ నేతలపై ప్రభుత్వం ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో శ్యామ్‌జీ ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. రెండుసార్లు సీఎంను కలిసినప్పటికీ.. ఈ విషయాన్ని వెల్లడించేందుకు పరిస్థితులు సహకరించలేదంట. అందుకే ఈసారి ఏకాంతంగా కలుసుకోవాలని ప్రయత్నించాడు. 

అయితే సిబ్బంది అతన్ని అనుమతించకపోవటంతో ఇలా చేశానని మిశ్రా చెప్పుకొచ్చాడు. కాగా, అతని గురించి సమాచారం అందుకున్న ఆదిత్యానాథ్‌ అతన్ని కలిసేందుకు పురమాయించినట్లు అధికారులు వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు