ఇంట్లో చొరబడితే... ఇంత దారుణమా!

18 Feb, 2016 16:38 IST|Sakshi
ఇంట్లో చొరబడితే... ఇంత దారుణమా!

రాంచీ: చుట్టుపక్కల ఇంట్లో ఉండే వ్యక్తిని దారుణంగా ఉరితీసి చంపేశారు. ఈ ఘటన జార్ఖండ్ లోని జంషెడ్పూర్ జిల్లా సీతారామదేరా పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... అనిల్ దాస్(32) జంషెడ్పూర్ సమీపంలోని చాయానగర్ లో నివాసం ఉంటున్నాడు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అదే ఏరియాలోని ఓ ఇంట్లో చోరీ చేయడానికి వెళ్లాడు. ఆ ఇంటి వాళ్లు దొంగను పట్టుకుని దారుణంగా హింసించారు. చివరికి ఆ నిందితుడి మెడకు తాడు చుట్టి ఏకంగా ఉరి తీసేశారు.

సమాచారం అందుకున్న సీతారామదేరా పోలీస్ ష్టేషన్ ఇంఛార్జీ లక్ష్మణ్ ప్రసాద్ నేతృత్వంలో పోలీసులు అక్కడికి చేరుకుని ఆదారాలను సేకరించారు. అనంతరం మృతుడు అనిల్ దాస్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. చోరీకి యత్నించిన వ్యక్తిని ఉరితీసిన కేసులో నలుగురు నిందితులను గుర్తించారు. రాధేయనాథ్, గణేశ్ శర్మ అలియాస్ ధకుంద్రా అనే నిందితులను అరెస్ట్ చేసినట్లు లక్ష్మణ్ ప్రసాద్ తెలిపారు. మరో ఇద్దరు నిందితులను పట్టుకునేందు గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. అయితే, అనిల్ దాస్ ఆ ఇంట్లోకి చోరీకి యత్నించాడా.. లేక నిందితులే అతడ్ని తమ ఇంట్లోకి తీసుకెళ్లి చంపివేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు