బండి కోసం భార్యను అమ్మేసిన ఘనుడు

1 Jul, 2014 15:33 IST|Sakshi
మోటర్ సైకిల్ నడిపించడం అంటే అతనికి ఎంత షోకంటే ఏకంగా భార్యనే అమ్మేశాడు. అలా వచ్చిన డబ్బుతో హాయిగా బైక్ కొనుక్కుని షికార్లు చేస్తున్నాడు ఆ ప్రబుద్ధుడు.
 
మధ్యప్రదేశ్ లోని బేతుల్ జిల్లాలోని ఆమ్లా లో రామూ అనే ఒక వ్యక్తి తన భార్య రాధను యాభై వేలకు అమ్మేసి, బండి కొనుక్కున్నాడు.
ఈ సంఘటన ఏడాది కింద జరిగినా ఇప్పటి వరకూ బయటకు రాలేదు. రాధతాలూకు బంధువులు రామూ ఇంటికి వచ్చి చూస్తే కానీ ఆమె లేదన్న విషయంవారికి తెలియలేదు. దాంతో ఆమె కోసం వెతుకులాట మొదలైంది. అప్పుడు రాము జరిగిందేమిటో చెప్పాడు. దాంతో అందరూ నిర్ఘాంతపోయారు.
 
ఈ మధ్య కాలంలో ఆమెను ఒకరి నుంచి ఇంకొకరు, ఆ తరువాత మరొకరు కొనుక్కున్నారు. ఇలా మూడు నాలుగు చేతులు మారాక ఒక మంచి వాడి చేతిలో పడి రాధకు మళ్లీ పెళ్లైపోయిన విషయం కూడా తెలిసింది. 
 
మన రామూ మాత్రం బండిలో తిరుగుతున్నాడు. ఆ బండి వెనక సీటులో కూర్చునే వారు మాత్రం ఎవరూ లేరు.  
 
మరిన్ని వార్తలు