92 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం, పదేళ్ల జైలు

1 Aug, 2014 11:49 IST|Sakshi

ముజఫర్ నగర్ : కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ ఉన్మాది 92ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసి చివరకు జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని షిమ్లీ జిల్లా కిండ్లా పట్టణంలో 26ఏళ్ల మంతూ అనే యువకుడు నాలుగేళ్ల పొరుగున నివసిస్తున్న ఓ వృద్ధురాలిపై ఆమె నివాసంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసు విచారించిన అడిషనల్ డిస్ట్రిక్ సెషన్ జడ్జి శ్యామ్ కుమార్ .... నిందితుడికి పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.55వేల జరిమానా కూడా విధించారు. కాగా  బాధితురాలు చనిపోయినా ఆమె వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసుకుంది. 2011 ఆగస్ట్ 10న ఈ సంఘటన చోటుచేసుకుంది.

మరిన్ని వార్తలు