కోవిడ్‌-19 భయంతో ఆత్మహత్య

21 May, 2020 20:10 IST|Sakshi

వెంటాడిన భయం

బెంగళూర్‌ : కరోనా మహమ్మారి సోకిందనే భయంతో ముంబై నుంచి వచ్చిన 55 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగుచూసింది. మంగళూరు క్వారంటైన్‌ కేంద్రంలో​ ముంబై నుంచి వచ్చిన వ్యక్తి కోవిడ్‌-19 భయంతో బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. ఇక మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. కరోనా హాట్‌స్పాట్‌గా మారిన ముంబై నగరాన్నీ కోవిడ్‌-19 వణికిస్తోంది. ఇక నగరంలో అతిపెద్ద మురికివాడ ధారవిలో గురువారం 47 తాజా కేసులు వెలుగుచూడగా, ఈ ప్రాంతంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1425కి పెరిగింది.

చదవండి : మహమ్మారితో వణుకుతున్న మహారాష్ట్ర

మరిన్ని వార్తలు