టీచర్పై దాడి.. ఆస్పత్రి పాలు

18 Jun, 2015 10:41 IST|Sakshi
టీచర్పై దాడి.. ఆస్పత్రి పాలు

ఇంపాల్: మణిపూర్లో ఓ ప్రవైటు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడిపై దాడి జరిగింది. తమ పిల్లాడిని బెత్తంతో కొట్టినందుకు ఆగ్రహించిన తల్లిదండ్రులు, బంధువులు, ఓ స్టూడెంట్ వింగ్ కలిసి అతడిపై తీవ్రంగా దాడి చేశారు. పిడిగుద్దులు గుప్పించారు. దీంతో ఆ టీచర్ ఆస్పత్రి పాలయ్యాడు. ఇంపాల్లోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో కంప్యూటర్ సైన్స్ టీచర్గా పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు ఆరో తరగతి చెందిన ఒక విద్యార్థిని తప్పుచేశాడని దండించాడు. క్లాస్ రూంలో అందరిమధ్య కర్రతో కొట్టాడు.

దీంతో ఆ బాలుడు కుటుంబ సభ్యులతో పాటు ఓ విద్యార్థి యూనియన్కు చెప్పగా మొత్తం పదహారు మందివచ్చి దాడి చేశారు. వారందరనీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ విద్యార్థి తప్పు చేసినందునే తాను విద్యార్థిని దండించానని, కావాలని ఏ ఉపాధ్యయుడు తన విద్యార్థిని కొట్టడని బాధిత ఉపాధ్యాయుడు వాపోయాడు. అతడు కోలుకునేందుకు కొన్ని వారాలు పడుతుందని వైద్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు