మావో డిప్యూటీ కమాండర్‌ మృతి

13 Oct, 2018 05:23 IST|Sakshi

పర్ణశాల(భద్రాద్రి కొత్తగూడెం): ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు డిప్యూటీ కమాండర్‌ కవాసి దేవా మృతి చెందారు. జిల్లా సరిహద్దుల్లో ఉన్న పుస్నార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తులసీ కొండల్లో గురువారం మావోయిస్టులు సమావేశం నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసు బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. పసిగట్టిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించగా పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. దాదాపు రెండు గంటలపాటు ఈ కాల్పులు కొనసాగాయి. అనంతరం మావోయిస్టులు దట్టమైన అడవిలోకి పారిపోగా పోలీసులు సంఘటన స్థలంలో ఓ మావోయిస్టు మృతదేహం, ఒక తుపాకీతోపాటు బాంబు తయారీకి వాడే పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు