బీఎస్‌ఎఫ్‌ వాహనం పై మావోయిస్టుల మెరుపు దాడి

14 Nov, 2018 12:47 IST|Sakshi

రాయపూర్‌: బీజాపుర్‌లో మావోయిస్టులు మళ్లీ పంజా విసిరారు. బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోలు మందుపాతర (ఐఈడీ)తో పేల్చివేశారు. ఈ దాడిలో ఐదుగు బీఎస్‌ఎఫ్‌ జవాన్లుకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటపలో నలుగురు బీఎస్‌ఎఫ్‌ జవాన్లతో పాటు వాహన డ్రైవర్‌కి తీవ్ర గాయాలైయ్యాయి. పోలీసు ఉన్నతాధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు