ఒబామా పర్యటనకు నిరసనగా రైల్వే ట్రాక్ పేల్చివేత

24 Jan, 2015 18:04 IST|Sakshi

రాయగఢ్: విశాఖపట్నం-రాయ్‌పూర్ రైల్వేలైన్ మార్గంలో  ఒడిషాలోని రాయగఢ వద్ద రైలు పట్టాలను శనివారం తెల్లవారుజామున మావోయిస్టులు పేల్చివేశారు. ఈ సంఘటనలో ఒకరు గాయపడగా,  ఈ రైలు మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాయగఢ సమీపంలోని మునిగుడ రైల్వే స్టేషన్ వద్ద మావోయిస్టులు అత్యాధునిక ఐఈడీని ఉపయోగించి పట్టాలను పేల్చివేశారని, ఓ మీటరు మేరకు పట్టాలు ధ్వంసమయ్యాయని,  ఐఈడీ ఎక్కువ శక్తివంతమైనది కాకపోవడం వల్ల ఎక్కువ నష్టం సంభవించలేదని రాయగఢ ఎస్పీ శివ సుబ్రమణి తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పర్యటనను వ్యతిరేకిస్తూ మావోయిస్టులు ఈ చర్యకు పాల్పడినట్లు భావిస్తున్నామని ఆయన చెప్పారు.
 
 

మరిన్ని వార్తలు