ఒడిశాలో మావోయిస్టుల ఘాతుకం

28 Feb, 2016 11:25 IST|Sakshi

ఒడిశా : మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జిల్లాలోని పనసపుట్టి గ్రామంలో ఇన్ఫార్మర్గా పని చేస్తున్నారనే నెపంతో ఒకరిని హతమార్చారు. పనసపుట్టి గ్రామానికి చెందిన వ్యక్తి... తమ కార్యకలాపాలను పోలీసులకు చేరవేస్తున్నాడని... అందువల్లే అతడిని హతమార్చినట్లు ఆ లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు స్థానికంగా విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు