- రూ. 5 కోట్ల ఆస్తి నష్టం
ఛత్తీస్గఢ్: చత్తీస్గఢ్లోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. జిల్లాలోని సిరోంచ తాలూకా రోంపల్లి అటవీ శాఖకు చెందిన కలప డిపోకు ఆదివారం రాత్రి మావోయిస్టులు నిప్పుపెట్టారు. దీంతో సుమారు రూ. 5 కోట్ల విలువైన కలప కాలి బూడిదైంది. మావోయిస్టులు సోమవారం బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బంద్ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో భారీగా మావోయిస్టుల పోస్టుర్లు వెలిసాయి. మావోల బంద్ నేపథ్యంలో ఖమ్మం జిల్లా చర్లలో వ్యాపారులు దుకాణాలు మూసి వేశారు.