డబ్బు అడగబోయినందకు 30ఏళ్ల మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆగ్నేయ ఢిల్లీలోని ద్వారకాలో ఓ గెస్ట్ హౌస్లో గతరాత్రి చోటుచేసుకుంది. డబ్బు విషయమై గెస్ట్హౌస్కు వెళ్లిన ఆమెను నలుగురు బలవంతంగా గ్యాంగ్రేప్ చేశారు. అనంతరం అక్కడి నుంచి నిందితులు పరారైయ్యారు.
బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఆ నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు వికాస్, అనిల్, రమేష్లుగా పోలీసులు గుర్తించారు. వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.