కలకలం.. పవిత్ర స్థలంలో మద్యం, మాంసం

26 Jun, 2017 13:14 IST|Sakshi
కలకలం.. పవిత్ర స్థలంలో మద్యం, మాంసం

అమేథి: పవిత్ర రంజాన్‌ రోజున మత ఘర్షణలు సృష్టించేందుకు గుర్తు తెలియని దుండగులు ప్లాన్‌ చేశారు. ప్రార్థనా స్థలంలో రాత్రవేళలో మద్యం, మాంసం వేసి వెళ్లారు. యూపీలోని అమేథీ షుకుల్‌ బజార్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

బాదల్‌ఘర్‌ ఈద్గాలో వద్ద రంజాన్‌ ప్రార్థనలకు వెళ్లిన వారు ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులకు సమాచారం అందించారు. ఈద్గాను శుభ్రం చేసిన అనంతరం అక్కడ రంజాన్‌ ప్రార్థనలు జరిగాయి. ఈ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్‌పీ పూనమ్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు