'రైతులకు కాదు.. రియల్టర్లకు లాభం'

30 Aug, 2016 19:19 IST|Sakshi
'రైతులకు కాదు.. రియల్టర్లకు లాభం'

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి కోసం ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్తో రైతులకు కాదు, రియల్టర్లకు మాత్రమే లాభం చేకూరుతుందని సామాజికవేత్త మేథా పాట్కర్ విమర్శించారు. మంగళవారం ఢిల్లీలో మేథా మాట్లాడారు. అమరావతి ప్రస్తుత నిర్మాణంతో అన్ని వృత్తులవారి జీవన పరిస్థితులు తీవ్రంగా ప్రభావితమతున్నాయని ఆమె అన్నారు.

వరదలు వస్తే సగం నగరం తుడిచి పెట్టుకుపోతుందని మండిపడ్డారు. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించి అమరావతి నిర్మించాలని మేథా పాట్కర్ డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు